
2027 వన్డే ప్రపంచకప్ కోసం 10 జట్లు పాల్గొనే క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్లను 2027 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల ఉమ్మడి ఆతిథ్యంలో 12 వేర్వేరు స్టేడియంలలో అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది.
ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ జట్టు, నేరుగా అర్హత సాధించాలంటే భారత్తో జరగనున్న రెండు వన్డేల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.