2013 నాటి 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్బస్ విమానాల కొనుగోలు ఒప్పందంలో 8,00,000 డాలర్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై నామల్ రాజపక్సను అధికారులు అరెస్ట్ చేశారు.
కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బోదరగామ 40 ఏళ్ల నామల్ రాజపక్సను రెండు వారాల పాటు రిమాండ్కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో మొత్తం 16 మిలియన్ డాలర్ల ముడుపులు చేతులు మారాయని, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ మాజీ సీఈఓ కపిల చంద్రసేన పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.