
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరచడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకుంది.
జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తూ పీసీబీ అధికారికంగా వేటు వేసింది.
ఆటగాళ్ల మధ్య విభేదాలు మరియు బోర్డు పనితీరుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ ప్రక్షాళన చేపట్టినట్లు సమాచారం.