
అసైన్డ్ భూముల కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
రాజకీయ కక్షసాధింపుతోనే ఈ కేసు నమోదు చేశారని పేర్కొంటూ, సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విచారణను సుప్రీంకోర్టు ముగించింది.