
ఈ నెల 3 నుంచి అమలు చేస్తున్న క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానాన్ని అక్రమ పద్ధతులతో దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు.
మార్కెట్ సమగ్రతను కాపాడేందుకు సెబీ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.