
ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ ఫైనల్లో లఖ్నవూ ఫాల్కన్స్పై 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మేరఠ్ మావెరిక్స్ టైటిల్ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన మేరఠ్ మావెరిక్స్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయి 9 విజయాలను నమోదు చేసింది.
కెప్టెన్గా రింకు సింగ్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ అందించడంతో, ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్సీ పగ్గాలను అతనికి అప్పగించాలనే చర్చ మొదలైంది.