
ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,71,38,182 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు.
మొత్తం ఓటర్లలో 1.89 కోట్ల మంది మహిళలు, 1.82 కోట్ల మంది పురుషులు ఉండగా, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 18,12,532 మంది ఓటర్లు నమోదయ్యారు.
ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఆగస్టు 30 వరకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.