
గత రెండేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంతో పాటు పేదలకు రూ.1.5 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం అందించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసి, 2028 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
నిర్మాణం పూర్తయిన తర్వాత 2028లో ప్రధాని చేతుల మీదుగా అమరావతిని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.