
భారత్లో జరిగినట్లుగా పాకిస్థాన్లోనూ యువత బొద్దింకల ఉద్యమం (సీజేపీ) చేపట్టే అవకాశం ఉందని ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ హెచ్చరించారు.
ఇస్లామాబాద్లో జరిగిన ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ, యువత ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
నిరాశలో ఉన్న యువత ఒక్కటైతే వ్యవస్థలను తలకిందులు చేయగలదని నఖ్వీ గురువారం వ్యాఖ్యానించారు.