
తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మందమర్రి ఐక్యకార్యచరణసమితి ఆధ్వర్యంలో ఆటోల బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది డ్రైవర్లు ఉండగా, ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ఈవీ ఆటోల ప్రతిపాదనల రద్దు, ఆత్మహత్య చేసుకున్న వారికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేశారు.
ఈ సమ్మెకు ఎంసీపీఐయూ, టీడీపీ, జనసేన, బీజేపీ, హెచ్ఎంఎస్ వంటి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.