
దేశీయంగా సోలార్ సెల్స్ లభ్యతలో ఎదురవుతున్న కొరత కేవలం తాత్కాలికమేనని, స్థానిక తయారీదారులు ఉత్పత్తిని వేగంగా పెంచుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దేశంలో సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 32 గిగావాట్లుగా ఉండగా, డిసెంబర్ 2027 నాటికి ఇది 100 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విక్రమ్ సోలార్ కంపెనీ 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 9 గిగావాట్ల దేశీయ సౌర సెల్ తయారీ సామర్థ్యాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఎండీ జ్ఞానేష్ చౌదరి తెలిపారు.