
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఆగస్టు 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవల టికెట్లను, ఆగస్టు 24న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటాను విడుదల చేస్తారు.