
మాదకద్రవ్య రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రధాని సూచించారు.
యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడి, ఆరోగ్యకరమైన భారతావనిని నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని చేపట్టాలని ఆయన కోరారు.