
దేశంలో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఢిల్లీలో నమోదవుతున్న ఇన్ఫ్లుయెంజా కేసుల్లో 70 శాతం హెచ్1ఎన్1 కేసులు ఉన్నాయని, 103-104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ప్రధాన లక్షణమని నిపుణులు తెలిపారు.
ఈ వైరస్కు యాంటీబయాటిక్స్ పనిచేయవని, వైద్యుల సూచన మేరకు మాత్రమే యాంటీవైరల్ మందులు వాడాలని, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.