
ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు మరణించారు.
బుధవారం ఉదయం గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 16 మంది శిశువులు ఉండగా, కేవలం ఒక్కరిని మాత్రమే అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు.