తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమతా ఆసుపత్రి న్యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ కసుకుర్తి జగదీష్ మృతి చెందారు.
హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్న భార్య వద్దకు కారులో వెళుతుండగా పిల్లలమర్రి వద్ద డివైడర్ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
కొత్తపట్నం మండలం సంకువారికుంటలోని స్వగ్రామంలో సోమవారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.