
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం కర్నూలు పర్యటన నేపథ్యంలో, నగరంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీలకు అనుమతి లేదని, కేవలం జైలులో ములాఖత్కు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు.
ఓర్వకల్లు ఎయిర్పోర్టు వద్ద జగన్కు వ్యతిరేకంగా 'గో బ్యాక్' ఫ్లెక్సీలు వెలియడం, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.