
రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.
ఈ కొత్త చట్టం ప్రకారం, రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం ట్రంప్నకు లభించింది.
భారత్, చైనాలు ఈ చట్టం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉండగా, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.