
సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న డీప్ఫేక్ వీడియోపై అర్జున్ రెడ్డి చిత్ర నటి శాలిని పాండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియో అని నటి స్పష్టం చేశారు.
నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఏఐ ఆధారిత నకిలీ వీడియో తనను ఎంతగానో కలచివేసిందని శాలిని పాండే ఆవేదన వ్యక్తం చేశారు.