
వచ్చే లోక్సభ ఎన్నికలు జరిగే 2029కి ముందే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబయిలో ప్రకటించారు.
భారతీయ న్యాయ సంహిత ద్వారా క్రిమినల్ న్యాయ వ్యవస్థ బలోపేతమయిందని, చాలా రాష్ట్రాల్లో ఏడాది కాలంలో పరిష్కరించిన కేసుల సంఖ్య 30 శాతం మేర పెరిగిందని ఆయన తెలిపారు.
దేశ భద్రతపై మాట్లాడుతూ బొట్టు రక్తం కారకుండా కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన అధికరణాలు రద్దయ్యాయని, 50 దశాబ్దాల చరిత్ర ఉన్న నక్సలిజం అంతమయిందని వెల్లడించారు.