
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని నికోపోల్ నగరం వద్ద ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా ఐదుగురు మృతి చెందారు.
ఈ బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారని ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా తెలిపారు.
రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా, ఐరోపా దేశాలను కోరారు.