
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో ఫైరింగ్ రేంజ్ గోడ వద్ద ప్లాస్టిక్ బకెట్ లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను అధికారులు గుర్తించారు.
మొత్తం 8 బండిల్స్ లో ఉన్న ఈ డిటోనేటర్ల విలువ సుమారు రూ. 32 వేలు ఉంటుందని ఆర్మీ సిబ్బంది బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మల్కాజిగిరి బాంబు డిస్పోజల్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.