
గత మూడేళ్లుగా విదేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ వేలాన్ని తిరిగి భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని స్వదేశంలోనే నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
మరోవైపు వివాదాస్పద 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై ఫ్రాంచైజీలు మరియు ఆటగాళ్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు.