
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అరకులోయలోని గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో సంజీవిని ప్రాజెక్టును ప్రారంభించి, స్థానిక గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ అమిత్ బర్దార్ పర్యవేక్షిస్తుండగా, ఆర్కే నగర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సీఎం పర్యటనలో భాగంగా గన్నెల పీహెచ్సీలో అత్యవసర మందుల సరఫరా కోసం సిద్ధం చేసిన డ్రోన్ను ఆయన పరిశీలించనున్నారు.