
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 72 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్-మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు పరిధిలోని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.