
ఉత్తర లిథువేనియాలోని సియౌలియై నుంచి ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన నాటో యుద్ధ విమానం గగనతలంలో తక్కువ ఎత్తులో కదులుతున్న అనుమానాస్పద వస్తువును గుర్తించడానికి బయలుదేరింది.
అయితే కోఆర్డినేట్లకు చేరుకున్న పైలట్లకు రాడార్లో డ్రోన్గా కనిపించిన ఆ వస్తువు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్న పక్షుల గుంపు అని తేలింది.
ఈ ఘటన నేపథ్యంలో లిథువేనియా విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినప్పటికీ, 38 నిమిషాల్లోనే స్పష్టత రావడంతో తిరిగి తెరిచారు.