
2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి వారం రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ నెతన్యాహును హెచ్చరించారని హారెట్జ్ కథనం పేర్కొంది.
ఈ దాడిలో 1,221 మంది మరణించగా, 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లిందని ఇజ్రాయెల్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
హెచ్చరికలు అందినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విపక్ష నేతలు నెతన్యాహుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.