
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.