
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద అతివేగంతో వచ్చిన టాటా సఫారీ కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సులుగా పనిచేస్తున్న హరిత, నవనీత అనే ఇద్దరు యువతులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.