
రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్లు వల్ల గోదావరి నది కలుషితమవుతోందని మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పరిశ్రమ రాజమండ్రి నగరపాలక సంస్థకు రూ.17.34 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు.
కాలుష్య నియంత్రణపై యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి సిద్ధమవుతున్నారు.