
ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులకు సోలార్ పంపుల ఏర్పాటుపై 60 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
3 హెచ్పీ సోలార్ పంపు ధర సబ్సిడీ తర్వాత సుమారు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు ఉండగా, 5 హెచ్పీ పంపు రూ. 60 వేల నుంచి రూ. 65 వేల వరకు ఉంటుంది.
అదనంగా 30 శాతం వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణ సదుపాయం అందుబాటులో ఉండటంతో, రైతులు తమ సొంతంగా కేవలం 10 శాతం ఖర్చుతోనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.