
చైనాలోని కింగ్హాయ్ ప్రావిన్స్లో బుధవారం ఉదయం 5:36 గంటలకు 5.6 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం హైక్సీ ప్రిఫెక్చర్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైందని చైనా ఎర్త్క్వెక్ నెట్వర్క్స్ సెంటర్ వెల్లడించింది.
ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని, స్థానిక యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోందని అధికారులు తెలిపారు.