
రూపాయి, రెండు రూపాయలతో సైతం చిన్న మొత్తాల్లో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై దృష్టి సారించింది.
డిజిటల్ గోల్డ్ విక్రయించే కంపెనీలు తాము అమ్మే ప్రతి యూనిట్కు సమానమైన భౌతిక బంగారాన్ని వాల్టుల్లో సురక్షితంగా భద్రపరిచేలా కొత్త నిబంధనల చట్రాన్ని తీసుకురానున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్ల తరహాలోనే డిజిటల్ గోల్డ్ను కూడా సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ చట్టం పరిధిలోకి తెచ్చి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని ఆర్బీఐ, సెబీ భావిస్తున్నాయి.