
జింబాబ్వేలోని కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 15 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు.
ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులు మరియు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.