
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరతతో 29 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఉన్న రెండు గదుల్లో ఒకటి శిథిలావస్థకు చేరడంతో తొలగించారు, దీంతో ప్రస్తుతం ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు.
తరగతి గదులు సరిపోకపోవడంతో పాఠశాల పక్కనే ఉన్న హనుమాన్ ఆలయ ఆవరణలోని రేకుల షెడ్డు కింద కొన్ని తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు.