
రోడ్డు ప్రమాదంలో మరణించిన దానయ్య కుటుంబాన్ని పరామర్శించకుండా, నిందితుడి కుటుంబానికి అండగా నిలిచిన జగన్ రెడ్డి తీరును మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు.
బాధితుడిని విస్మరించి నిందితుడికి మద్దతు తెలపడం జగన్ రెడ్డి నేర మనస్తత్వానికి నిదర్శనమని లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ రెడ్డి తీరు అమానవీయమని, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి నాయకుడు మరొకరు ఉండరని లోకేశ్ విమర్శించారు.