
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో విభేదాల నేపథ్యంలో బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు తన పదవికి, రాజకీయాలకు రాజీనామా చేశారు.
బోగోలు మండలంలో వైఎస్ జగన్ ఫోటో పెట్టి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర రఘు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడినా తగిన గుర్తింపు దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే ఇటీవల దగదర్తి తాళ్లూరి వర్గం, ఇప్పుడు వీర రఘు పార్టీకి దూరమయ్యారని స్థానికంగా చర్చ జరుగుతోంది.