
అమెరికాలో మెడికేర్ స్కీమ్ను దుర్వినియోగం చేసి సుమారు రూ.620 కోట్ల మేర మోసానికి పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు మహ్మద్ ఖదీర్ఖాన్ హైదరాబాద్కు చేరినట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి అమెరికా నిఘా వర్గాలు మరియు దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన ఇన్పుట్ల ఆధారంగా నగర పోలీసులు తదనుగుణమైన సమారాన్ని సేకరిస్తున్నారు.
హైదరాబాద్లో తలదాచుకున్నట్లు భావిస్తున్న ఈ నిందితుడి కదలికలపై నిఘా వర్గాలు మరియు పోలీసులు మరింత సమాచారాన్ని సేకరించి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.