
భారతదేశం క్లీన్ ఎనర్జీ రంగంలో 300.50 గిగావాట్ల నాన్-ఫాసిల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి కొత్త మైలురాయిని అందుకుంది.
దేశ మొత్తం 552 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంలో సోలార్ (164.59), విండ్ (58.14), హైడ్రో (57.24), బయో (11.75), మరియు నూక్లియర్ (8.78) వాటా ఉంది.
2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, 2025-26లో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సామర్థ్యాన్ని కొత్తగా జోడించింది.