
శనివారం జరగనున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
ప్రధానికి స్వాగతం పలికేందుకు 16 వేల మంది ఆదివాసీ బాలికలు థింసా నృత్యం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
విమానాశ్రయ ప్రాంగణంలో ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏటికొప్పాక కళాకృతులు, తోలుబొమ్మలాట వంటి ప్రత్యేక అలంకరణలు చేశారు.