
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.3 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, గోరెమియా అనే వ్యక్తులు బాధితుల నుంచి మొత్తం రూ.7 లక్షలు డిమాండ్ చేయగా, మరో నిందితురాలు షేక్ యాస్మిన్ పరారీలో ఉంది.
ఉద్యోగం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు మావల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.