
హైదరాబాద్ నగరంలోని పనీర్ మరియు డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
మొత్తం 12 ప్రత్యేక బృందాలతో నగరంలోని 14 డెయిరీ యూనిట్లలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
కల్తీ ఉత్పత్తులను అరికట్టేందుకు చేపట్టిన ఈ తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.