తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విభేదాల నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెను తొలగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ అంశంపై చర్చించేందుకు కొండా సురేఖ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.