
ఏపీలో లిక్కర్ అక్రమ రవాణా కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిట్ అతి చేస్తోందని వ్యాఖ్యానించింది.
రెండేళ్లుగా కేసు కొనసాగుతున్నా ఇప్పటివరకు ఏం కనుగొన్నారని ప్రశ్నించిన ధర్మాసనం, హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని హెచ్చరించింది.
నిందితుడి కస్టడీ విషయంలో సిట్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టిన కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.