
బెల్జియం & నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న FIH పురుషుల హాకీ వరల్డ్ కప్ 2026లో, సోమవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో భారత్ 3-5 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది.
భారత్ తరఫున సుఖ్ జీత్ సింగ్ రెండు గోల్స్, హార్దిక్ సింగ్ ఒక గోల్ చేయగా, అర్జెంటీనా ఆటగాడు టోమస్ డొమెనె రెండు గోల్స్ సాధించి టోర్నమెంట్లో తన మొత్తం గోల్స్ సంఖ్యను ఏడుకు పెంచుకున్నాడు.
ఈ ఓటమితో పూల్-ఈలో పాయింట్లు సాధించలేకపోయిన భారత్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించి, ఏడు లేదా ఎనిమిదో స్థానం కోసం జరిగే క్లాసిఫికేషన్ మ్యాచ్లకు పరిమితమైంది.