విశాఖపట్నం నుంచి కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ బస్సులు అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయని, ప్రయాణికులకు తక్కువ ధరకే రవాణా సదుపాయం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ బస్సులు పూర్తిస్థాయిలో సేవలు అందించనున్నాయి.