
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను సీఎం చంద్రబాబు బుధవారం విడుదల చేశారు.
ఈ నీటి రాకతో ఉత్తరాంధ్రలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెంది వలసలు తగ్గుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న పరిశ్రమలు, డేటా సెంటర్ల ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.