
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కిస్తున్న మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్ చిత్రానికి 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అని పేరు పెట్టారు.
హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుండగా, ఇందులో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి జే రెక్స్ సంగీతం అందించారు.