
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ ప్రాంతంలో నాలాను ఆక్రమించి నిర్మించిన అక్రమ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
మూడు రోజుల క్రితం 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం కుప్పకూలడంతో, పక్కనే ఉన్న ప్రమాదకరమైన మరో భవనాన్ని అధికారులు తొలగిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రెండంతస్తుల అనుమతితో ఏడెనిమిది అంతస్తులు నిర్మించడం వల్లే భవనాల పటిష్టత దెబ్బతిన్నదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.