
అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాపై 15-13 స్కోరుతో గెలిచి, గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్లో విజేతగా నిలిచిన తొలి భారత ఆటగాడిగా 21 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
ఈ విజయంతో ప్రజ్ఞానంద రూ. 1.91 కోట్ల ప్రైజ్మనీని అందుకోవడమే కాకుండా, వచ్చే ఏడాది టోర్నీకి నేరుగా అర్హత సాధించాడు.
ఆఖరి రోజు పోరుకు ముందు 3-9 పాయింట్లతో వెనుకబడిన ప్రజ్ఞానంద, అద్భుతంగా పుంజుకుని టైటిల్ను కైవసం చేసుకున్నాడు.